No Helmet No Petrol: రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు కలెక్టర్ గరిమ అగర్వాల్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ఇకపై హెల్మెట్ ధరించని వారికి పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ పోయరు. ఈ నిబంధనను తప్పనిసరిగా అమలు చేయాలని బంకు యజమానులకు, సిబ్బందికి సూచించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి, వాటిని బాగుచేయడంతో పాటు, నెలవారీ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ రోడ్డు భద్రతను మెరుగుపరిచేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.