ఏపీలో రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారుతున్నాయి. అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద రాష్ట్రంలో పలు రైల్వేస్టేషన్లను కేంద్రం అభివృద్ధి చేస్తోంది. ఈ క్రమంలోనే అనకాపల్లిలోని ఎలమంచిలి రైల్వే స్టేషన్ రూపురేఖలు మారుతున్నాయి. పది కోట్లతో రైల్వేస్టేషన్లో అభివృద్ధి పనులు చేపట్టారు. మధ్యలో వివిధ కారణాలతో ఆగిన పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. మరోవైపు ఎలమంచిలి రైల్వేస్టేషన్లో కొత్త రైళ్లకు హాల్ట్ ఇవ్వాలనే ప్రతిపాదనలు కూడా వస్తున్నాయి.