వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకొని.. దక్షిణ మధ్య రైల్వే జూన్ 1 నుండి జూలై 31 వరకు 44 స్పెషల్ వీక్లీ రైళ్లను నడపనుంది. విశాఖపట్నం-బెంగళూరు, విశాఖపట్నం-తిరుపతి, విశాఖపట్నం-చర్లపల్లి మార్గాల్లో ఈ అదనపు రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ఈ చర్య ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం, సురక్షితమైన ప్రయాణాన్ని అందించడంతో పాటు టికెట్ల కొరతను తగ్గించడంలో సహాయపడుతుంది. రైల్వే అధికారులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.