తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి ఉచిత బస్సు పథకంలో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. కొందరు కండక్టర్లు ఆధార్ కార్డు మాత్రమే చెల్లుబాటు అవుతుందని ఇతర గుర్తింపు కార్డులను తిరస్కరిస్తున్నారు. దీనివల్ల మహిళా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఆధార్ కార్డే అవసరం లేదని.. తెలంగాణ స్థానికత కలిగిన ఏ గుర్తింపు కార్డు అయినా చెల్లుబాటు అవుతుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే ఫిర్యాదు చేయవచ్చని ఆర్టీసీ ఈడీ రాజశేఖర్ తెలిపారు.