ఆమెకు 40, అతనికి 25.. రోజూ అదేపని చేస్తుండగా.. చివరకు..

9 months ago 30
ఆమె వయసు 40 ఏళ్ళు, కొడుకు మెడికల్ రిప్రజెంటేటివ్‌గా, కూతురు డిగ్రీ ఫైనల్ ఇయర్‌లో ఉన్నారు. భర్త ఉన్నా, ఆమె ఇంకేదో ప్రేమను కోరుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన 25 ఏళ్ల సురేష్‌తో ప్రేమలో పడి, కుటుంబాన్ని వదిలి శ్రీకాళహస్తికి వెళ్లిపోయింది. పోలీసులు పద్మను వెనక్కి రప్పించినా, మళ్లీ సురేష్‌ను పెళ్లి చేసుకుని కొత్త కాపురం పెట్టింది. అయితే, సురేష్ తన తల్లికి పద్మ మూడు రోజుల క్రితం చనిపోయిందని, టిఫిన్ వృధా చేయడంపై మందలించగా ఉరివేసుకుందని చెప్పాడు. పద్మ మృతితో భయపడి తాను కూడా విషం తాగానని, మూడు రోజుల తర్వాత కోలుకున్నానని సురేష్ తెలిపాడు. సురేష్ తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, పద్మ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే పురుగుల మందు తాగిన సురేష్ కూడా మృతి చెందాడు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ఈ ఇద్దరి జీవితాలు ఏడాది కూడా గడవకుండానే విషాదకరంగా ముగిశాయి.
Read Entire Article