ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,618 కోట్లు విడుదల చేసింది. సాంకేతిక సమస్యల వల్ల నిధులు అందని వారు వెంటనే తమ బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ అనుసంధానం చేసుకోవాలని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వి.పి.గౌతమ్ సూచించారు. ఆధార్ అనుసంధానం లేకుంటే నిధులు జమ కావని ఆయన స్పష్టం చేశారు.