indiramma illu: రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం వేగంగా అమలవుతోంది. దాదాపు 77.18 లక్షల మంది గృహాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. రెండో విడతలో లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పంపిణీ చేశారు. లబ్ధిదారులు నెల రోజుల్లో ఇంటి నిర్మాణం ప్రారంభించాలని, లేకుంటే మంజూరు రద్దవుతుందని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో 4.50 లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది.