ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. ఇక నుంచి బిల్లులు ఆలస్యం లేకుండా.. వెంటనే అకౌంట్లోకి..

3 months ago 15
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రామగుండం పర్యటనలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకునే కొద్దీ విడతల వారీగా నిధులు మంజూరు చేస్తామని, ప్రతి వారం బిల్లులు విడుదలయ్యేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తూ.. నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ప్రభుత్వం కేటాయించింది. దీనితో పాటు రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు, సింగరేణి కార్మికులకు కోటి రూపాయల ప్రమాద బీమా వంటి కీలక హామీలను ఆయన పేర్కొన్నారు.
Read Entire Article