తెలంగాణలోని ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 1,612.37 కోట్ల రూపాయలను లబ్ధిదారులకు అందించారు. నిర్మాణ దశను బట్టి విడతలవారీగా మొత్తం 5 లక్షలు వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నారు. మొత్తం నాలుగు విడతలుగా డబ్బులను వారి ఖాతాల్లో జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు 1.5 లక్షల గృహాలకు పంపిణీ పూర్తి అయింది. డబ్బు జమ కానివాళ్లు బ్యాంకుకు వెళ్లి తమ ఆధార్ను ఖాతాతో లింక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.