ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేదలకు గుడ్ న్యూస్ వినిపించారు. త్వరలోనే తెలంగాణలోని మున్సిపాల్టీల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. ఇంటి నిర్మాణం కోసం స్థలం ఉంటే ఇందిరమ్మ ఇళ్లు.. స్థలం లేని వారికి జీప్లస్ 2 తరహాలో ఇళ్లు నిర్మించి ఇస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. గ్రామీణ ప్రాంతవాసుల కోసం 4.50 లక్షల ఇళ్లు కట్టించినట్లు ఆయన వివరించారు. పేదల కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు.