సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో టీటీడీ ఆధ్వర్యంలో నడిచే అన్ని ఆలయాల్లో నిత్యాన్నదాన పథకం ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా చంద్రబాబు సతీసమేతంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. టీటీడీ ఆధ్వర్యంలోని అన్ని దేవాలయాల్లో నిత్యాన్నదానం అందుబాటులోకి తేవాలని టీటీడీని ఆదేశించారు. అలాగే సుమారుగా ఐదువేల గ్రామాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించాలని సూచించారు.