ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ ఇళ్ల స్థలాల హక్కులపై రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్ కీలక ప్రకటన చేశారు. పదేళ్ల కిందట ఇచ్చిన ఇంటి స్థలాలకు త్వరలోనే హక్కులు కల్పిస్తామన్నారు. శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి అనగాని సత్యప్రసాద్.. ఈ విషయాన్ని వెల్లడించారు. ఇనాం భూములు సమస్య, 22ఏ జాబితాలోని భూముల అంశం, కొత్త పట్టాదారు పాసుపుస్తకాల అంశంపైనా మంత్రి వివరణ ఇచ్చారు. అలాగే గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు అనగాని సత్యప్రసాద్.