ఎంత పని చేశావు అమ్మ.. ముద్దులొలికే పిల్లలకు విషమిచ్చిన కన్న తల్లి.. ఆ తర్వాత..

3 months ago 11
నంద్యాల జిల్లా ఎన్జీవో కాలనీలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ కలహాల కారణంగా మల్లిక అనే మహిళ తన ఇద్దరు చిన్నపిల్లలకు విషమిచ్చి.. అనంతరం తాను ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. మూడేళ్ల కుమారుడు ఇషాన్ సాయి, ఏడు నెలల కుమార్తె పరిమిత ఈ ఘటనలో మరణించారు. భర్త ఉదయ్ కిరణ్‌తో తరచూ గొడవలు జరుగుతుండటమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. అయితే.. మల్లిక శరీరంపై గాయాలు ఉండటంతో ఆమె బంధువులు భర్తపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి.. ఇది ఆత్మహత్యా లేక హత్య అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. క్షణికావేశంలో తీసుకున్న ఈ నిర్ణయం ఒక నిండు కుటుంబాన్ని బలితీసుకుంది.
Read Entire Article