తెలంగాణలో శాంతిభద్రతలు అడుగంటుతున్నాయని, భూ మాఫియా ఆగడాలు మితిమీరిపోతున్నాయని విపక్షాలు, ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఏకశిల నగర్లో జరిగిన ఘోరమైన దాడి ఈ పరిస్థితికి అద్దం పడుతోందని, ప్రభుత్వం ప్రజల ప్రాణాలను కాపాడటంలో విఫలమైందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించాలని, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.