తెలంగాణ పురపాలికల్లో మేయర్, ఛైర్మన్ల ఎన్నికకు సంబంధించి తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసింది. ముఖ్యంగా ఎక్స్ అఫీషియో ఓటుపై కీలక ఆదేశాలు ఇచ్చింది. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఓటింగ్లో పాల్గొనాలంటే సదరు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ కచ్చితంగా ఆ మున్సిపాలిటీలో ఓటరు అయి ఉండాలి. లేదంటే వారు ఎక్స్ అఫీషియో సభ్యులుగా అనర్హులు.