ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చబోయి ఇద్దరు సర్పంచ్లు చిక్కుల్లో పడ్డారు. వీధికుక్కల బెడదను తొలగిస్తామని చెప్పి ఏకంగా 120కి పైగా కుక్కలను అమానుషంగా చంపి పాతిపెట్టారు. జంతు హింస నిరోధక చట్టం ప్రకారం ఇది నేరమని వారిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.