ఏపీలో పేకాట రాయుళ్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తిరుపతి జిల్లాలో స్వర్ణముఖి నది ఒడ్డున పేకాట రాయుళ్లు గుట్టుగా సెటప్ చేశారు. ఈ క్రమంలో డ్రోన్ల సహాయంతో పేకాట ఆడుతున్న 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి నగదు, మొబైల్ ఫోన్లు, మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పేకాట ఆడుతూ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.