ఏపీ కోస్తా తీరం 80 కిలోమీటర్లు పెరిగి 1,053 కిలోమీటర్లకు చేరింది. ఈ మేరకు వైసీపీ ఎంపీ గొల్ల బాబూరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పార్లమెంట్లో సమాధానం ఇచ్చారు. ఏపీ సహా దేశవ్యాప్తంగా తీర పొడవు గణనీయంగా పెరిగింది. ఈ కొత్త లెక్కలు.. పోర్టులు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి, ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయడానికి ఉపయోగపడతాయి. కాగా ఇంతకుముందు ఏపీ రెండో స్థానంలో ఉండేది. ఇప్పుడు తమిళనాడు ఏపీని దాటేసింది. గుజరాత్ మొదటి స్థానంలో ఉంది.