Andhra Pradesh Covid 19 Vigilance: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్ కొవిడ్ పై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్, మందులు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు. జ్వరం, గొంతు నొప్పి కేసులు వస్తే వెంటనే తెలియజేయాలని సూచించారు. కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.