AP Weather Today: ఏపీని భారీ వర్షాలు మరోసారి ముంచెత్తాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాల కారణంగా గోదావరి నదిలో నీటిమట్టం పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.