Ap Govt Decided To Sell Onion Rs 35 Per Kg: ఏపీ ప్రభుత్వం ఉల్లిపాయలు తక్కువ ధరకు విక్రయించాలని నిర్ణయించింది. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమై చర్చించింది.. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉల్లిపాయలు కేజీ రూ.35 చొప్పున రైతు బజార్లు, ప్రత్యేక కౌంటర్ల ద్వారా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉల్లితోపాటుగా పామాయిల్, కందిపప్పు, ఇతర నిత్యావసరాల ధరలపై కేబినెట్ సబ్ కమిటీ సమీక్ష చేసింది.