Ap Cm Chandrababu Naidu On Online Services: ఏపీ ప్రజలకు ఆన్లైన్ సేవలు మరింత సులభతరం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఏ ఒక్కరూ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే పని లేకుండా సేవలు అందించాలన్నారు. ప్రస్తుతం వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా అందిస్తున్న 1,204 సేవలకు సంబంధించి డేటా ఎంట్రీ సమాచారాన్ని మరింత సంక్షిప్తం చేయాలన్నారు. ఆర్టీజీఎస్ సమీక్షలో వివిధ శాఖల పనితీరు, పురోగతి గురించి ఆరా తీశారు.