'ప్రభుత్వం ఇంకా కమ్మగానే ఉంటోంది.... కులాలకు సంబంధం లేకుండా అందరినీ సమానంగా చూడాలి' అంటూ జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. పని చేసే వారికి అవకాశాలు కల్పించాలని.. కులాలను బట్టి కాదని ఘాటు కామెంట్స్ చేసారు. తిరుపతిలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో చేసిన ఈ వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వంలో చర్చనీయాంశంగా మారాయి.