ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి ఆరోగ్య సమాచారం నమోదు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని అసెంబ్లీ వేదికగా చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి హెల్త్ రికార్డు నమోదు చేస్తామని వెల్లడించారు. 41 రకాల వైద్య పరీక్షలు చేసి హెల్త్ రికార్డు నమోదు చేయనున్నట్లు తెలిపారు. మితంగా తీసుకుంటే ఆహారమని.. అమితంగా తీసుకుంటే అనారోగ్యానికి కారణమవుతుందని చంద్రబాబు సూచించారు.