ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు సంక్రాంతి కానుక అందించింది. ఉద్యోగులతో పాటు వివిధ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు తీపికబురు వినిపించింది. ఉద్యోగులకు డీఏ, డీఏ బకాయిలతో పాటుగా కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులను ఆర్థిక శాఖ క్లియర్ చేసింది. మొత్తం 5.7 లక్షల మందికి ఉపయోగపడేలా రూ.2653 కోట్ల నిధులు విడుదల చేసింది. ఇందులో ఉద్యోగులకు సంబంధించి డీఏ, డీఏ ఎరియర్స్, సరెండర్ లీవ్స్తో పాటుగా కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయి.