చేనేత కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. నెలకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందించడంతో పాటుగా థ్రిఫ్ట్ ఫండ్ పథకం వంటి చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే హిందూపురంలోని చేనేతల కోసం ఏపీ ప్రభుత్వం కొత్త కార్యక్రమం అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకమైన స్మాల్ క్లస్టర్ డెవలప్మెంట్ హిందూపురానికి మంజూరైంది. ఈ ప్రోగ్రామ్ కింద చేనేతలకు ఆధునిక దుస్తుల తయారీపై ఫ్యాషన్ డిజైనర్లు, నిపుణులతో ట్రైనింగ్ అందించనున్నారు. ఈ స్మాల్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మీద ఎమ్మెల్యే బాలకృష్ణ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.