Andhra Pradesh Farmers Cotton Price Fixed: ఆంధ్రప్రదేశ్లో 2025-26 సీజన్ కోసం పత్తి కొనుగోలు మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. సీఎం యాప్ ద్వారా కనీస మద్దతు ధరకు సీసీఐ పత్తి కొనుగోలు చేస్తుంది. పొడవు పింజ పత్తి క్వింటా రూ.8,110, మధ్యస్త పింజ పత్తి క్వింటా రూ.7,710గా నిర్ణయించారు. రైతుల నమోదు, స్లాట్ బుకింగ్ కోసం కాపాస్ కిసాన్ యాప్ను అందుబాటులోకి తెచ్చారు. పత్తి కొనుగోలు పనుల పర్యవేక్షణకు జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశారు.