Chandrababu Orders On Tobacco Rates: ఆంధ్రప్రదేశ్లో పొగాకు రైతుల కష్టాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించారు. గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతుంటే, కొనుగోళ్లు వేగవంతం చేయాలని ఆదేశించారు. క్వింటాలుకు రూ.12 వేలు తగ్గకుండా వారం రోజుల్లో కొనుగోళ్లు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మరోవైపు జగన్ పొదిలి పర్యటన వాయిదా పడగా, ఎమ్మెల్యే నారాయణరెడ్డి మాత్రం ప్రభుత్వం రైతుల కోసం చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.