Andhra Pradesh Land Bank With 1 Lakh Acres: ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు కోసం కనీసం లక్ష ఎకరాలతో భూ బ్యాంక్ను సిద్ధం చేయాలని ప్లాన్ చేసింది. భూసేకరణ కోసం ప్రణాళికలు రూపొందించిన ప్రభుత్వం.. జిల్లా కలెక్టర్లకు ప్రతిపాదనలు పంపించింది. ల్యాండ్ బ్యాంక్ ద్వారా ముందుగానే భూమిని సేకరిస్తే.. రాష్ట్రానికి పెట్టుబడుల్ని సులభంగా తీసుకురావొచ్చని ఈ ఆలోచన చేసింది.