Ci Shankaraiah Legal Notice To Chandrababu: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పులివెందుల సీఐగా పనిచేసిన జె.శంకరయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పరువుకు నష్టం కలిగించేలా చంద్రబాబు తప్పుడు ప్రకటనలు చేశారని ఆరోపిస్తూ లీగల్ నోటీసులు పంపారు. అసెంబ్లీలో బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, రూ.1.45 కోట్ల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వివేకా హత్య సమయంలో నిందితులు ఆధారాలు ధ్వంసం చేస్తుంటే చూస్తూ ఊరుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.