ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఊరటనిచ్చింది. వైకాపా ప్రభుత్వ హయాంలో నిలిపివేసిన 1/2019 సర్క్యులర్ను పునరుద్ధరించాలని నిర్ణయించింది. చిన్న తప్పిదాలకే పెద్ద శిక్షలు విధిస్తున్నారని ఉద్యోగులు ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం స్పందించింది. దీనికి కట్టుబడి ఉండాలని యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, ప్రయాణికుల భద్రత కోసం కొత్త బస్సుల్లో ఫైర్ అలారం, సిలిండర్లు ఏర్పాటు చేయనున్నారు.