Nara Lokesh On Investments To Andhra Pradesh: గత 15 నెలల్లో ఆంధ్రప్రదేశ్కు రూ.10.40 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి లోకేష్ శాసనమండలిలో ప్రకటించారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన తెలిపారు. ఆర్సెలార్ మిత్తల్ విశాఖలో భారీ ఉక్కు కర్మాగారాన్ని నవంబరులో ప్రారంభిస్తుందని, పలు పెద్ద కంపెనీలు పెట్టుబడులకు ముందుకు వస్తున్నాయని లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం అనేక పాలసీలను తీసుకువచ్చిందని ఆయన వెల్లడించారు.