ఏపీకి కేంద్రం శుభవార్త అందించింది. రాష్ట్రంలోని ఈఎస్ఐఎస్ ఆస్పత్రిని మెడికల్ కాలేజీగా అప్గ్రేడ్ చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు ప్రకటించింది. కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే రాజ్యసభలో ఈ మేరకు ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న పది ఈఎస్ఐసీ, ఈఎస్ఐఎస్ ఆస్పత్రులను మెడికల్ కాలేజీలుగా మార్చాలని కేంద్రం భావిస్తోంది. ఈ క్రమంలోనే విశాఖపట్నంలోని ఈఎస్ఐస్ ఆస్పత్రిని మెడికల్ కాలేజీగా ఉన్నతీకరించే ఆలోచనలో ఉన్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆస్పత్రిని అప్పగించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని వివరించారు.