ఏపీలో ఆడబిడ్డ నిధి పథకం గురించి కీలక అప్డేట్ వచ్చింది. అసెంబ్లీలో జరిగిన చర్చలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆడబిడ్డ నిధి పథకం అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేస్తూ వస్తున్నట్లు మంత్రి వివరించారు. ఆడబిడ్డ నిధి పథకం అమలు పరిశీలిస్తున్నామని.. విధివిధానాలు రూపొందించాల్సి ఉందని అన్నారు. 2014-19 కాలంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం 89 లక్షల మంది మహిళలకు ఆర్థిక సాయం అందిస్తే.. వైసీపీ వైఎస్ఆర్ చేయూత అంటూ దానిని 25 లక్షల మందికే పరిమితం చేసిందని మండిపడ్డారు.