Tadepalli Three Corona Cases 2025: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయ్. ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడా కేసులు బయటపడుతున్నా, భయపడాల్సిన పనిలేదని అధికారులు అంటున్నారు. గుంటూరు మణిపాల్ ఆసుపత్రిలో మూడు కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. వృద్ధుడి పరిస్థితి విషమంగా ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పరిస్థితిని ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో కూడా కేసులు పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.