AP Free Bus Scheme New Buses: ఆంధ్రప్రదేశ్లో స్త్రీ శక్తి పథకం విజయవంతంగా అమలవుతోందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రతిరోజు 22 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు, దీనివలన వారికి నెలకు రూ.2వేల నుంచి రూ.3వేల వరకు ఆదా అవుతోంది. ప్రభుత్వం కొత్తగా 1,500 బస్సులు కొనుగోలు చేయడంతో పాటు, 750 ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్ ఇచ్చింది, త్వరలో మరో 1,500 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి.