ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రమోషన్ల ప్రక్రియను వేగవంతం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఫలితంగా మరో 20 రోజుల్లో అర్హులైన ఉద్యోగులందరికీ పదోన్నతులు దక్కనున్నాయి. అంతేకాకుండా ప్రతి సంవత్సరం నిర్దిష్ట సమయంలో ప్రమోషన్లు ఇచ్చేందుకు ప్రత్యేక షెడ్యూల్ రూపొందించారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రత్యేక కార్యదర్శి కె విజయానంద్ ఆదివారం (జనవరి 11) ప్రత్యేక కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రటరీలు, హెచ్వోడీలకు అత్యవసర మెమో జారీ చేశారు.