Andhra Pradesh Birth Death Registration New Rules: ఏపీ ప్రభుత్వం జనన, మరణాల నమోదుకు సంబంధించిన నిబంధనల్ని మార్చేసింది. ఇకపై 21 రోజుల్లోగా జనన, మరణాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సిందే. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 21 రోజుల్లోపు నమోదు చేసుకోకపోతే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.. అపరాధ రుసుముతో పాటుగా అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఏపీ ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని ప్రభుత్వం సూచిస్తోంది.