Ichchapuram Nellore Four Railway Lines: ఏపీలో సరుకు రవాణా అంశంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర నుంచి నెల్లూరు వరకు రైల్వే కనెక్టివిటీని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఇచ్ఛాపురం నుంచి నెల్లూరు వరకు రైల్వే లైన్లను నాలుగు వరుసలుగా అందుబాటులోకి వస్తే సరుకు రవాణా మరింత వేగవంతం అవుతుందన్నారు. అంతేకాదు రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు, నేషనల్ హైవేలకు సంబంధించి కలెక్టర్లు భూ సేకరణపై దృష్టి పెట్టాలని సూచించారు.