Kurnool To Toranagallu Railway Line: కర్నూలు నుండి ఎమ్మిగనూరు, ఆదోని, మంత్రాలయం మీదుగా కర్ణాటకలోని తోర్నగల్ వరకు కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఎంపీ, ఎమ్మెల్యేలు రైల్వే మంత్రిని కలిసి విజ్ఞప్తి చేయగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ రైల్వే లైన్ సర్వే, డీపీఆర్ కోసం తక్షణ చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ మార్గం కర్నూలు జిల్లా వాసులకు, మంత్రాలయం వచ్చే భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు.