Three New Police Commissionerates In Andhra Pradesh: ఏపీలో కొత్తగా మూడు పోలీస్ కమిషనరేట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తిరుపతి, గుంటూరు, రాజమండ్రి పోలీస్ కమిషనరేట్లుగా అప్గ్రేడ్ చేయాలని ప్రతిపాదించారు. పూర్తిస్థాయి ప్రతిపాదనలు పంపాలని ముగ్గురు ఎస్పీలను డీజీపీ ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో జనాభా, నగరాల విస్తరణ, నేరాల నియంత్రణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా ఈ మూడు కమిషనరేట్ల అప్గ్రేడ్ ప్రక్రియను మరింత వేగవంతం చేయనున్నారు.