Andhra Pradesh Dwcra Women Rs 1 Lakh Loan: స్త్రీ నిధి ద్వారా 2025-26 నాటికి రూ.5,700 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. డిజిటల్ ఫైనాన్స్ వైపు మహిళలను ప్రోత్సహించాలని, సీఐఎఫ్ రుణాలను స్త్రీ నిధి ద్వారానే అందించాలని ఆయన ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో స్త్రీ నిధి నిధులను మళ్లించిన వారిపై విచారణ జరపాలని, అర్హులైన డ్వాక్రా మహిళలకు తక్కువ వడ్డీకే రుణాలు అందించాలని నిర్ణయించారు.