ఏపీలో మహిళల మరణాలతో పోలిస్తే మగవారి మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. 2009 నుంచి 2022 వరకూ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ గణాంకాలను విశ్లేషిస్తే ఈ విషయం వెలుగు చూసింది. అందులోనూ 25 ఏళ్ల నుంచి 44 ఏళ్ల మధ్య వయసు గలవారిలో ఈ తేడా ఎక్కువగా ఉంది. అయితే దీనిని వైద్యులు వేర్వేరు కారణాలను విశ్లేషిస్తున్నారు. మరోవైపు ఈ గణాంకాలను పూర్తిస్థాయిలో విశ్లేషించాలని ప్రజారోగ్య వేదిక కోరుతోంది.