Mulapet Port Trail Run In April: ఆంధ్రప్రదేశ్లో కొత్త పోర్టుల పనులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఉత్తరాంధ్రకు కీలకమైన మూలపేట పోర్టు పనులు ఏకంగా 75శాతం పనులు పూర్తి చేశారు. ఏప్రిల్ నెలలో ట్రయల్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మిగిలిన 25శాతం పనుల్ని కూడా ఈ ఏడాది నవంంబర్ నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ పోర్టుకు అనుబంధంగా ఇండస్ట్రియల్ క్లస్టర్ కూడా ఏర్పాటు కాబోతోంది.