Andhra Pradesh Ration Shops Mini Malls: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ షాపుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రేషన్ షాపులు రోజంతా తెరిచి ఉంచనున్నారు. వాటిని మినీమాల్స్గా మార్చి నిత్యావసర వస్తువులు కూడా అందుబాటులో ఉంచనున్నారు. ప్రస్తుతం నెలలో కొన్ని రోజులు మాత్రమే రేషన్ పంపిణీ చేస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తొలి దశలో ఒక్కో నగరంలో 15 చొప్పున 75 షాపులను ఎంపిక చేస్తున్నారు.