Ap Smart Ration Cards Rs 200 After December 15th: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ పంపిణీలో పారదర్శకత కోసం స్మార్ట్ కార్డులు అందిస్తోంది. ఆగస్టు నుంచి పంపిణీ జరుగుతున్నా, చాలామంది ఇంకా తీసుకోవడం లేదు. ఈ నెల 15 లోపు కార్డులు తీసుకోకపోతే రద్దు చేస్తారని అధికారులు స్పష్టం చేశారు. కొత్త కార్డుల కోసం రూ.200 చెల్లించి గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. కార్డులు రద్దు అవుతాయనే భయం వద్దు.