ఏపీలో శరవేగంగా రహదారుల నిర్మాణం.. వారం రోజుల్లో నాలుగు గిన్నీస్ రికార్డులు..

7 months ago 28
ఆంధ్రప్రదేశ్‌లో రహదారుల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. బెంగళూరు- కడప- విజయవాడ ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా.. కేవలం వారం రోజుల్లో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) నాలుగు గిన్నీస్ రికార్డులను సృష్టించింది. జనవరి 6న రెండు, జనవరి 11న మరో రెండు వరల్డ్ రికార్డులను నమోదు చేసింది. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఇది చైనా, జర్మనీ, అమెరికా కాదని.. సరికొత్త భారతం అని అన్నారు. ఈ ఘనత సాధించిన ఎన్‌హెచ్ఏఐ, రాజ్‌పథ్‌ ఇన్‌ఫ్రాకాన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు అభినందనలు తెలిపారు.
Read Entire Article