Andhra Pradesh Monsoon Entered: ఆంధ్రప్రదేశ్ రైతులకు వాతావరణ శాఖ శుభవార్త తెలిపింది. నైరుతి రుతుపవనాలు రాయలసీమ ప్రాంతం ద్వారా రాష్ట్రంలోకి ప్రవేశించాయని, రాగల మూడు రోజుల్లో మిగిలిన ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.