ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తోందని మంత్రి కందుల దుర్గేశ్ వెల్లడించారు. ఇందులో భాగంగానే కారవాన్ టూరిజం, టెంట్ సిటీలను ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి తెలిపారు. గత ప్రభుత్వంతో పోలిస్తే.. తమ ప్రభుత్వం కేంద్రం నుంచి ఎక్కువ నిధులను, పెట్టుబడులను ఆకర్షించిందని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో జరిగిన అవకతవకలపై కూడా విచారణ జరుగుతోందని వివరించారు.