Kakinada Town Railway Station Inauguration October 2nd: ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ను అమృత్ భారత్ పథకం కింద రూ.21.13 కోట్లతో ఆధునీకరించారు. అక్టోబరు 2న ప్రారంభోత్సవానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం నూతన వసతులు, విశాలమైన స్థలం, తాగునీటి ట్యాంకులు, ఆధునిక మరుగుదొడ్లు, డిజిటల్ వ్యవస్థ, పార్కింగ్ స్థలం వంటి అనేక మార్పులు చేశారు. స్టేషన్ గోడలపై స్వాతంత్య్ర సమరయోధుల బొమ్మలు ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.